Sunday, February 23, 2025

సూరత్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన అదాజన్ పాలన్‌పూర్ పాటియా ప్రాంతంలోని సిద్ధేశ్వర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులంతా విషం సేవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం ఫర్నీచర్ వ్యాపారం చేస్తోంది. అయితే కుటుంబం మొత్తం ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News