న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,466 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 175 మరణాలు సంభవించాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 1,65,799కి చేరుకుంది. భారత్లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 89,987 ఉన్నాయి. ఇప్పటివరకు 71,105 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
దేశవ్యాప్తంగా 4,706 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 59,546 చేరుకున్నాయి, ప్రస్తుతం 38,948 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 18,616 మంది బాధితులు కోలుకుని నయమైయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,982 మంది కోవిడ్ తో చనిపోయారు. తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
7466 new covid 19 cases and 175 deaths in india