Friday, September 20, 2024

కరోనా…. పాడె పైనుంచి ఏడ్చిన వృద్ధురాలు

- Advertisement -
- Advertisement -

76-year old Covid victim opens eyes minutes before cremation

ముంబయి: కరోనా సోకిన వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడిపోవడంతో చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా ఆమె కళ్లు తెరిచి చూడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించిన సంఘటన మహారాష్ట్ర బారామతి ప్రాంతం ముధలే గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శకుంతల గైక్వాడ్ (76) అనే వృద్ధురాలు కరోనా బారిన పడింది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పలు ఆస్పత్రులకు తీసుకెళ్లిన పడకలు లేకపోవడంతో ఎవరు అడ్మిట్ చేసుకోలేదు.  ఇంటికి తీసుకొచ్చిన తరువాత ఆ వృద్ధురాలు అచేతనంగా పడిపోవడంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. పాడె మీద పడుకోబెట్టిన తరువాత  అందరూ ఏడ్వడంతో ఆ వృద్ధురాలు కళ్లు తెరిచి ఏడ్వసాగింది. వెంటనే ఆమెను బారామతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News