- Advertisement -
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 796 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 11మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,285కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో ఎపికి చెందిన 740 మందికి కరోనా సోకగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 6,648 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో 157 మంది చనిపోయారు. ఇక, కరోనా వైరస్ నుంచి 5,480మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
796 New Corona Cases Reported in AP
- Advertisement -