Thursday, September 19, 2024

ఛత్తీస్‌గఢ్‌లో 8 మంది మావోయిస్టులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 8 మంది మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు, డిఆర్‌జి, బస్తర్ ఫైటర్స్, సిఆర్‌పిఎఫ్ 231 బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా పక్కా సమాచారంతో పోలీసులు బెనుపల్లి గ్రామంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News