Sunday, September 8, 2024

లోయలో పడిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ల్: జమ్మూ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉదయం ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న లోయలో పడిపోవడంతో ఐదుగురు పిల్లలతోసహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. మృతులలో ఒక పోలీసు అధికారి, ఇద్దరు మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని అధికారులు తెలిపారు.

కిష్టార్ నుంచి మార్వాకు సింతన్ మీదుగా వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు డాక్సం వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఈ ప్రమాదంలో మరణించారని వారు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News