Tuesday, September 17, 2024

సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 8 మంది పాక్ సైనికుల మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో బన్నూ కంటోన్మెంట్‌పై భారీ ఉగ్రదాడి జరిగింది. 10 మంది ఉగ్రవాదులు సోమవారం బన్నూ కంటోన్మెంట్‌పై దాడి చేయడంతో ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్టు పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం మీడియాకు సమాచారం తెలియజేసింది. దీంతో పాక్ సైన్యం కూడా ఎదురు దాడి చేయడంతో దాదాపు 10 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి జరిగిన దాదాపు 24 గంటల తరువాత పాక్‌సైన్యం ప్రకటించడం గమనార్హం. దాడి జరిగిన ప్రదేశానికి దగ్గర్లోనే సైన్యానికి చెందిన కీలక సప్లైడిపోఉంది. మొదట ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారని, వారి వెనుక మరో 8 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు.

ఇక్కడ ఉగ్రదాడి పేలుళ్లు 15 కిలోమీటర్ల దూరం లోని డొమెల్ టౌన్ లోకి స్పష్టంగా వినిపించినట్టు ప్రత్యక్షసాక్షులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్ ప్రాంతం మొత్తం నల్లటి పొగతో నిండిపోయినట్టు వారు చెబుతున్నారు. బాంబు పేలుళ్ల తీవ్రతకు చుట్టుపక్కల ఇళ్ల గోడలు బీటలు వారినట్టు పేర్కొన్నారు. అఫ్గాన్ సరిహద్దుల్లో పాక్ దళాలు తీవ్రస్థాయిలో ముప్పును ఎదుర్కొంటున్నాయి. మరోవైపు అఫ్గాన్ లోని తాలిబన్లు డ్యూరాండ్ రేఖను అంగీకరించడం లేదు.

ఈ ప్రాంతంలో టీటీపీ గ్రూపు చాలా చురుగ్గా ఉంది. ఈ గ్రూప్ అఫ్గానిస్థాన్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలను నిర్వహిస్తోంది. డిసెంబర్ 2023లో డేరా ఇస్మాయిల్ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేశారు. నాడు మొత్తం 23 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదం గణనీయంగా పెరిగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News