అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఎపిలో ప్రతిరోజు దాదాపు తొమ్మిదొందల కేసుల వరకు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో మొత్తం 38,898 కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 837 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని, కరోనాతో మరో తొమ్మిది మంది మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఇందులో విదేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా సోకగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 46మందికి పాజిటీవ్ వచ్చిది. దీంతో రాష్ట్రంలో మొత్తం 16,934 కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నారు.ఇక, రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటివరకు 206మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 9,096 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,632 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.
837 New Corona Cases Reported in AP