- Advertisement -
హైదరాబాద్ః తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో రాష్ట్రంలో పది వేల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 891 కరోనా కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఐదుగురు మరణించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఈ రోజు కరోనా నుంచి 137 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 10,444కు చేరుకుంది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 225 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 5,858 మంద కరోనా బాధితులు చికిత్స పొందుతునారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,361మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
891 New Corona Cases Reported in Telangana
- Advertisement -