న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,851 కొత్త కోవిడ్-19 కేసులు, 273 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షల 26వేల 770 చేరింది. ఇండియాలో యాక్టివ్ కేసులు లక్షా 10వేల 960 ఉన్నాయి. ఇప్పటివరకు 1,09,462 కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ బారిన పడి 6,348 మంది బాధితులు మరణించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.
అటు మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 77,793కు చేరుకోగా… 2,710మంది కరోనాతో చనిపోయారు. తమిళనాడులో 27,256 మందికి కరోనా సోకగా… 220 కరోనా మరణాలు సంభవించాయి. దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 25వేలు క్రాస్ చేశాయి. ఇప్పటివరకు 650 మంది కోవిడ్ తో మృతి చెందారు. గుజరాత్ లో 18,584 కేసులు నమోదు కాగా… 1,155 మందిని కరోనా బలితీసుకుంది. రోజురోజుకు కరోనా మహమ్మారి ఉదృతి మాత్రం ఆగడం లేదు. భారీగా కేసులు నమోదవుతున్నాయి.
9851 new covid 19 cases and 273 deaths in india