Tuesday, September 17, 2024

దేశంలో కొత్తగా 9,996 మందికి సోకిన కరోనా

- Advertisement -
- Advertisement -

9996 new covid 19 cases and 357 deaths in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కొత్త కోవిడ్-19 కేసులు, 357 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసులు 2లక్షల 86,579కి చేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,37,448 యాక్టివ్ కేసులున్నాయి. ఈ వైరస్ మహమ్మారి నుంచి 1,41,029 నయమై కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా మరణాలు 8,102కు చేరుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. అటు తెలుగురాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది.

ఎపిలో కరోనా పాజిటివ్ కేసలుు 5వేలు దాటాయి. 78 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో 4,111 కోవిడ్ కేసులు, 156 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 94,041 చేరుకోగా… 3,438మంది బాధితులు మృతి చెందారు. తమిళనాడులో 36,841మందికి కరోనా సోకగా… 326 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్ లో 21,521 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 1,347 మందిని ఈ మహమ్మారి కబలించింది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 32,810కి పెరిగాయి. 984 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కరోనా విజృంభణ వేగంగా కొనసాగుతోంది.

9996 new covid 19 cases and 357 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News