Sunday, September 8, 2024

మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పదిహేడేళ్ల మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి)లో పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగికి పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలికి దూరపు బంధువు అయిన నిందితుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఈ కేసును విచారించిన తొలి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె.సునీత.. పోక్సో చట్టం, ఐపిసి కింద నిందితుడిని దోషిగా తేల్చింది. దీంతో నిందితుడికి పదేళ్ల కఠినకారగార శిక్షతోపాటు రూ. 2,000 జరిమానా విధించింది.

Pvt Employee gets 10 years RI for raping case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News