- Advertisement -
బర్కత్పుర: భార్యను కాపాడి భర్త ప్రాణాలు విడిచిన సంఘటన హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మహబూబ్నగర్ జిల్లా శంకర్ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ (42) చెప్పులు కుట్టుకుంటు ఉప్పుగూడలో నివసిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన భార్య సరితతో కలిసి పట్టాలు దాటుతుండగా ఎంఎంటిఎస్ రైలు రావడంతో ఆమెను ముందుకు నెట్టాడు. ఎంఎంటిఎస్ రైలు ఢీకొని ఘటనా స్థలంలో శ్రావణ్ చనిపోయాడు. సరితా స్వల్పంగా గాయపడింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
One Person Dead in MMTS Train Accident in Kachiguda
- Advertisement -