అమరావతి: ఎపిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు టిడిపి, జెఎసి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆదివారం రాత్రి వరకు 48 నియోజకవర్గాల్లో టిడిపి ముఖ్యనేతలు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గుంటూరులోని చిలకలూరు పేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మైలవరంలో దేవినేని ఉమా, విజయవాడలో బోండా ఉమా, బుద్ధా వెంకన్న, కేశినేని నానిలను హౌస్ అరెస్ట్ చేశారు.
టిడిపి, జెఎసి నేతలను గృహ నిర్భంధించడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. నిరసన తెలిపే హక్కు వైసిపి వాళ్లకే కాదు దేశ పౌరులందరికీ ఉందని, ఈ విధమైన అణచివేత చర్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమన్నారు.తక్షణమే గృహనిర్బంధాలను ఎత్తివేయాలని, అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chalo Assembly Protest: TDP leaders house arrested