హైదరాబాద్ : నగరంలో నిరుద్యోగుల కోసం గ్రేట్ ఇండియా మీడియా జాబ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 1వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు మీడియా, ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం దిల్షుక్నగర్, కూకట్పల్లి, చందానగర్లో ప్రారంభించి, నగరంలో ఐదు ప్రాంతాల్లో జాబ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో ఉద్యోగాల కోసం అభ్యర్దులను ఎంపిక చేసుకునేందుకు 100కుపైగా ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నట్లు ఎమ్మెస్కో సీఈఓ మెహిత్ సోని తెలిపారు. తాము దేశవ్యాప్తంగా 10 నగరాల పరిధిలో 78 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రతి కేంద్రంలో 100మంది వరకు ఎంపిక చేస్తామని, గ్రాఫిక్ డిజైనర్లు, 3డి మోడల్స్, విఎఫ్ఎక్స్, వెబ్ డిజైనింగ్, మోషన్ గ్రాఫిక్స్, రోట్స్కాఫీ, యానిమేషన్తో పలు ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ ఫెస్టివల్ అమెజాన్, టెక్నోకలర్, ఎంపిసి ఫిలిం, వాకీటూన్, సిమ్ప్రెస్, డిజిటల్ మైనా స్టూడియో, విస్టా ప్రింట్స్ వంటి సంస్దలు పాల్గొనున్నట్లు వివరించారు.