లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బహదూర్పూర్ గ్రామానికి చెందిన అఖిలేష్ రావత్ అనే వ్యక్తికి భార్య ఉంది. దంపతుల మధ్య గొడవలు రావడంతో భార్యను అఖిలేష్ హత్య చేసి అనంతరం మృతదేహం నుంచి తలను వేరు చేశాడు. భార్య తలతో జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తలతో పిఎస్కు వచ్చిన వ్యక్తిని చూసి పోలీసులు షాక్కు గురయ్యారు. వెంటనే తలను పోలీసులు తీసుకొవడానికి ప్రయత్నించారు. నిందితుడు తల ఇవ్వకపోవడంతో అతడికి, పోలీసులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. తలను పోలీసులు స్వాధీనం చేసుకున్న అనంతరం నిందితుడు జాతీయ గీతాలాపన చేయడంతో పాటు భారత్ మాతా కీ జై అని పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి మొండెం దగ్గరకు తలను తీసుకెళ్లారు. అనంతరం శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.