- Advertisement -
అమరావతి: బ్యాంక్ మేనేజర్ తన భార్యకు సైనైడ్ ఇచ్చి చంపేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రవి చైతన్య అనే యువకుడు ఆమని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా మదనపల్లె బ్రాంచ్ మేనేజర్ రవి చైతన్య పని చేస్తున్నాడు. అతడి భార్య ఆమని కొన్ని రోజుల నుంచి బి విటమిన్ లోపంతో బాధపడుతోంది. బికాంప్లెక్స్ క్యాప్సూల్లో సైనైడ్ పెట్టి భార్యకిచ్చాడు. దీంతో ఆమె మాత్రలు మింగి చనిపోయింది. తన కూతురు మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆమని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రవి చైతన్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Bank Manager murder to his wife with cyanide
- Advertisement -