- Advertisement -
అక్లాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలో ఎదురు దెబ్బ తగిలింది. 24 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 104 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే ధాటిగా ఆడుతున్నాడు. ఓపెనర్లు, మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత్ బ్యాట్స్ మెన్లలో పృధ్వీ షా(24), విరాట్ కోహ్లీ(15), జాధవ్(09), మయాంక్ అగర్వాల్(03), రాహుల్(04) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్ (45), జడేజా (01) పరుగులతో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా బెనట్, జమ్సీన్, గ్రాండ్ హోమ్ తలో ఒక వికెట్ పడగొట్టారు.
India loss Five Wickets for 104 in Ind vs NZ Match
- Advertisement -