- Advertisement -
నెల్లూరు: జిల్లాలోని తడ మండలం పన్నంగాడు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న పాల ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను ప్రకాశం జిల్లా దర్శి వాసులుగా పోలీసులు గుర్తించారు.
Three dead in a road accident at nellore district
- Advertisement -