ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ పోరాటంలో టీమ్ఇండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కరోనాపై పోరుకు తన వంతు సహాయంగా రూ.80 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించాడు.
పిఎం-కేర్స్ నిధికి రూ.45లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25లక్షలు, ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు రూ.5లక్షలు చొప్పున అందించినట్టు రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని, ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ప్రధాని మోడీతో పాటు నాయకులకు మనమందరం మద్దతుగా నిలుద్దామని రోహిత్ శర్మ పిలుపునిచ్చాడు.
Rohit Sharma donates Rs 80 lakhs to Fight Corona