Sunday, September 22, 2024

స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్..

- Advertisement -
- Advertisement -

 

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వనున్నాడు. ‘అల వైకుంఠపురంలో’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. ఇక, ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా రూపొందుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వనుంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను ఇవ్వనున్నట్లు చిత్రయూనిట్ ట్వీట్టర్ ద్వారా ప్రకటించింది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సిినిమా తెరకెక్కుతుంది.  దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బన్నీ సరసన రష్మిక మంధాన కథానాయికగా నటిస్తోంది.

Mythri Movie Makers Tweet #AA20 Updates on April 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News