- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సత్తెనపల్లిలో మెడికల్ షాపులో మెడిసిన్ తీసుకొవడానికి వచ్చిన యువకుడిని పోలీసులు కొట్టడంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. మందుల కోసం వచ్చిన నా బిడ్డను పోలీసోళ్లు పొట్టన బెట్టుకున్నారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల తీరుపై సత్తెనపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చిన కూడా పోలీసులు కొడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.
Police killed young man over beat in sattenapalle
- Advertisement -