కెసిఆర్ తో కలిసి నడవడంతో ఎన్నో నేర్చుకున్నాను
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కెసిఆర్ 20 ఏళ్ల ప్రస్థానంలోని కీలక ఘట్టాలను రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ నెమరు వేసుకున్నారు. ఇరవై ఏళ్లుగా ఆయనతో కలిసి అడుగులు వేసి, సన్నిహితంగా మెదిలి ఉద్యమంలో పాల్గొన్న సంతోష్కుమార్ ఆనాటి సంఘటనలు గుర్తు చేశారు. కెసిఆర్తో కలిసి నడవడంతో ఎన్నో నేర్చుకున్నానని ట్విట్టర్ వేదికగా సంతోష్కుమార్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఎంపి సంతోష్కుమార్ రాసిన ఆర్టికల్ను ట్విట్టర్లో పాస్టుచేశారు. 20 ఏళ ్లప్రస్థానంలో ఉద్యమనేత కెసిఆర్తో నడిచిన సందర్భాలు, ఆయనతో సన్నిహితంగా గడిపిన క్షణాలు నాహృదయాంతరాల్లో భద్రంగా ఉన్నాయని, కెసిఆర్ చిత్రం నాహృదయంలో కొలువుతీరిందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈట్విట్టర్ను చూసిన నెటిజన్లు ఆనాటి సంఘనలు, సంతోష్ రాసిన ఆర్టికల్ను లైక్ చేస్తు పోస్టులు చేస్తున్నారు.