- Advertisement -
అమరావతి: తన కుటుంబంలో ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. తమ కుటుంబ సభ్యులు జిజిహెచ్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని, అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, మరణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా బాధితుల సంఖ్య 1097కు చేరుకోగా 31 మంది చనిపోయారు. కర్నూలు, గుంటూరు, క్రిష్ణ జిల్లాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. చాప కింద నీరులా ఈ మూడు జిల్లాలో కరోనా వైరస్ విస్తరించి ఉంది. తెలంగాణలో కరోనా రోగుల 1001కి చేరుకోగా 25 మంది మృత్యువాతపడ్డారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 27,890కి చేరుకోగా 881 మంది బలయ్యారు.
Corona virus infected to MP Family Members in AP
- Advertisement -