- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,813 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య మొత్తం 31,787కు చేరింది. దేశవ్యాప్తంగా 22,982 మంది కరోనా బాధితులకు చికిత్స కొనసాగుతుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 7,796 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా బారిన పడి మొత్తం 1008 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది.
1,813 New Corona Cases Registered in India
- Advertisement -