మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో నిర్మించిన 1500 పడకల కోవిడ్19 ఆసుపత్రికి మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డి.. ఎంపి నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ను కలిసి ఈ మేరకు ఆయన లేఖ అందజేశారు. టిమ్స్ ఆసుపత్రికి సివరేజీ ప్లాంట్ నిర్మాణాన్ని అధికారులు విస్మరించారు. ఈ కారణంగా మురుగు నీరంతా పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోకి వెళుతోంది. అక్కడ విద్యార్థులు, సిబ్బంది ఈ సమస్యను సోషల్ మీడియాలో లేవనెత్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వారంలోగా ప్లాంట్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎంఎల్ఎ శ్రీశైలంగౌడ్, మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పారీ ఇంఛార్జి నందికంటి శ్రీధర్లు పాల్గొన్నారు.