- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. భారత సైన్యంలోనూ కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో ఆరుగురు బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఇందులో కర్నాటక నుంచి నలుగురు జవాన్లు ఉండగా.. త్రిపుర, ఢిల్లీ నుంచి మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు. పాజిటీవ్ నిర్ధారణ అయిన వీరందరూ కోవిడ్ హెల్త్ కేర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
6 BSF Jawans have tested COVID-19 positive
- Advertisement -