- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే రైతులు వేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వర్షాకాలంలో రైతులు మొక్కజొన్న పంటలు వేయొద్దని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలతో వరిసాగు చేయాలన్నారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణానికి స్థలాలు సేకరిస్తామని, యుద్ధ ప్రాతిపదికన వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని సబితా పిలుపునిచ్చారు.
- Advertisement -