హైదరాబాద్: ఈ వర్షాకాలంలోపు దుబ్బాకలోని అన్ని చెరువులను నింపుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అసన్ మీరాపూర్ వద్ద ప్యాకేజీ 12 డిస్ట్రిబ్యూట్ కెనాల్తో పాటు దుబ్బాకలోని పలు చెరువులు నింపే మరో కెనాల్ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కెనాల్ పనులకు రైతులు, అధికారులు సహకరించాలని కోరారు. మల్లన్నసాగర్ కెనాల్ పనులను కూడా పరిశీలించారు. చట్టపరంగా రావాల్సిన ప్రతి పైసాను కూడా రైతులకు పరిహారం కింద ఇస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. సర్పంచ్లు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, రైతులు ముందుకొచ్చి పనులు వేగంగా జరిగేటట్లు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నీళ్లు 170 కిలో మీటర్లు ప్రయాణించి సిద్దిపేటకు వచ్చాయన్నారు. గోదావరి నీళ్లతో రైతులు రెండు పంటలు సాగుచేసుకోవాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు.
దుబ్బాకలో అన్ని చెరువులను నింపుతాం: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -