- Advertisement -
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ, సిఆర్పిఎఫ్, సోఫియాన్ పోలీసులు కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయని.. ఈ నేపథ్యంలో సంఘటన ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.
5 Terrorists Killed in Shopian Encounter in J&K
- Advertisement -