- Advertisement -
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షల అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 8వ తేదీన (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో జిహెచ్ఎంసి మినహా తెలంగాణ రాష్ట్రంలో అన్నిచోట్లా పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పరీక్షలనే వాయిదా వేసింది. ఈ క్రమంలో హైకోర్టు ఆర్డర్స్ మీద సమగ్రంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం పదో తరగతి పరీక్షల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర విద్యాశాఖ అధికారులు హాజరుకానున్నారు.
- Advertisement -