Saturday, September 21, 2024

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

9987 new covid 19 cases and 331 deaths in india

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రతరమవుతున్నాయి. అటు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి భయపెడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,987 కొత్త కోవిడ్-19 కేసులు, 331 మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు 2లక్షల 66,598 చేరుకున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో కరోనాతో 7,466 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు  1,29,215 నయమై కోలుకున్నారు.

ప్రస్తుతం 1,29,917 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 88,528 కేసులు, 3,169 కరోనా మరణాలు నమోదయ్యాయి. తమిళనాడులో 33,229 మందికి కరోనా సోకగా.. 286మంది ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు 29,943 చేరుకోగా.. 874మంది కరోనాతో చనిపోయారు. గుజరాత్ లో 20,545 కరోనా కేసులు.. 1,280 కరోనాతో మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా విజృంభణ వేగంగా కొనసాగుతుంది.

9987 new covid 19 cases and 331 deaths in india

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News