Sunday, September 22, 2024

శబరిమలలో భక్తులకు అనుమతి లేదు..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శబరిమలలో భక్తులను అనుమతించడం జరగదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను అనుమతించబోమని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. దేవాలయ ప్రధానర్చకులు, ట్రావెన్‌కోర దేవస్థానం బోర్డు సభ్యులతో మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సమావేశమయ్యారు. ఆలయంలో జరిపే నెలవారీ పూజలతోపాటు ఆలయ ఉత్సవాలు కూడా వాయిదా వేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.శబరిమల ఆలయంలో సాధారణంగా జరిగే పూజలు మాత్రమే కొనసాగుతాయని ఆయన చెప్పారు.  జూన్ 14 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఇదివరకే చెప్పామని దేవస్థానం బోర్డు పేర్కొంది.

Devotees Not Allowed to be in Sabarimala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News