- Advertisement -
చెన్నైః తమిళనాడు రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పోరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 3,940 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. కరోనాతో మరో 54మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 82,275కు చేరింది. ఇక, కరోనాతో తమిళనాడులో ఇప్పటివరకు 1,079 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం తమిళనాడులోని వివిధ ఆస్పత్రుల్లో 35,659 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,537 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
3940 New Corona Cases Reported in Tamil Nadu
- Advertisement -