- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ ఉగ్రరూపంతో దూసుకుపోతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాటిజటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 14,419కి చేరింది. తాజాగా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులు నమోదుకావడంతో నగర ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక, కరోనాతో మరణించిన వారి సంఖ్య 247కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,172మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
983 New Corona Cases Reported in Telangana
- Advertisement -