- Advertisement -
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రోజుకు దాదాపు వెయ్యి కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,238 మందికి పరీక్షలు చేయగా, 1,178 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 13మంది మృతి చెందారని ఎపి వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,197కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 252కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రిల్లో 11,200మంది చికిత్స పొందతున్నారు. ఇప్పటివరకు 9,745మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
1178 New Corona Cases in Reported in AP
- Advertisement -