- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవు తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,795 కొత్త పాజిటివ్ కేసులు, 8 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 1,14,483కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 788కి పెరిగింది. ఇప్పటివరకు 86,095 మంది కరోనాతో కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, 24 గంటల్లో 872 మంది ఈ వైరస్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా హైదరాబాద్ లో 449, రంగారెడ్డిలో 268, నల్గొండలో 164 కోవిడ్-19 కేసులు రికార్డు అయ్యాయి. అటు దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది.
2795 new corona cases reported in telangana
- Advertisement -