- Advertisement -
బీజింగ్: ఓ రెస్టారెంట్ కుప్పకూలి 29 మంది మృతి చెందిన విషాద సంఘటన చైనాలోని శాంషీ ప్రావిన్సులో చోటుచేసుకుంది. శిథిలాల కింద చాలా మంది స్థానికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 57 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఆ రెస్టారెంటులో ఓ జన్మదిన వేడుక జరుగుతున్న సమయంలో రెస్టారెంటు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా… మరో 21 మందికి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -