- Advertisement -
హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురాలో రౌడీమూకలు రెచ్చిపోయాయి. ఇంటిముందు బైక్ పార్క్ చేసినందుకు ఓ కుటుంబంపై దాడికి దిగాయి. రోడ్డుకు అడ్డంగా బైక్ పెట్టారంటూ రౌడీగ్యాంగ్ ఓ కుటుంబంతో గొడవకు దిగింది. తల్వార్లు, ఇనుప రాడ్లతో రౌడీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. ఇంట్లోకి జొరబడి అందర్నీ ఇష్టానుసారంగా కొడుతూ రివాల్వర్ తో బెదిరించారు. రౌడీల దాడిలో కుటుంబసభ్యులకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అటు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -