- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. సోమవారం ఒక్క రోజే 2058 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృతి చెందారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1.60 లక్షలకు చేరుకోగా 984 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1.29 లక్షల మంది కోలుకోగా 30 వేల మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 51,247 కరోనా పరీక్షలు చేయగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 22.2 లక్షలకు చేరుకుంది.
- Advertisement -