- Advertisement -
ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వైరస్ ధాటికి మహానగరాలు గజ గజ వణికిపోతున్నాయి. ప్రతి రోజు దాదాపుగా 95 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 83,809 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1054 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 49.30 లక్షలకు చేరుకోగా 80,776 మంది చనిపోయారు. కరోనా నుంచి 38.59 లక్షల మంది కోలుకోగా 9.9 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 10.72 లక్షల మందికి టెస్టులు చేయగా మొత్తం కరోనా టెస్టులు సంఖ్య 5.83 కోట్లకు చేరిందని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -