- Advertisement -
ముంబై: రేపిస్టులను బహిరంగంగా కాల్చిపారేయాలని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో ఓ 20 ఏళ్ల యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై ట్వీట్టర్ ద్వారా స్పందించిన ఈ అమ్మడు ” రేప్ చేసేవారిని పబ్లిక్ లో షూట్ చేయాలి. ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతున్న సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏంటి.? ఈ తరహా ఘటనలపై సిగ్గుపడాలి. మన కుమార్తెలను కాపుడుకోలేకపోవడం సిగ్గుచేటు” అన తన అసహనాన్ని వ్యక్తం చేసింది. కొద్ది రోజులుగా తరచూ వార్తలలో నిలుస్తున్న కంగనా సుశాంత్ మరణించిన తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులని ఉద్దేశిస్తూ తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది.
Shoot these rapists publicly says Kangana Ranaut
- Advertisement -