- Advertisement -
ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ముంబయిలాంటి నగరాలలో మారణహోమం సృష్టిస్తోంది. కరోనా వైరస్ మహానగరాలు గజ గజ వణికిపోతున్నాయి. కరోనా వైరస్ దాదాపుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 10.86 లక్షల మంది టెస్టులు చేయగా 80,472 మంది కరోనా పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం ఒక్క రోజే 1179 కరోనా వైరస్ తో మృత్యువాతపడ్డారు. భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 62.25 లక్షలకు చేరుకోగా 97,497 మంది చనిపోయారు. కరోనా నుంచి 51.87 లక్షల మంది కోలుకోగా 9.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. భారత్ లో మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 7.41 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.
- Advertisement -