హత్రాస్ : సంచలనం రేపిన హత్యాచార ఘటనపై హత్రాస్ గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారని, వారి సన్నిహిత సంబంధం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. నిందితుడే బాలికకు సెల్ ఫోన్ ఇచ్చాడని, కుటుంబ సభ్యులే బాధితురాలిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. హిందూ మతంలో అలాంటి హేయమైన నేరానికి ఎవరూ పాల్పడరని, నిందితులంతా నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇతరుల నేరానికి మరో వ్యక్తి ని శిక్షించరాదని అన్నారు. నిందితులపై నేరాన్ని ముందుగా రుజువు చేయాలని కోరారు. బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం సహించలేదని ఆయన ఆరోపించారు. బాలికను కలిసేందుకు నిందితుడు రాగా పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారని ఆరోపించారు. ఇక బాధితురాలు కుటుంబం, నిందితుడి మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని, ఈ కేసులో బాలిక సోదరుడిని పోలీసులు ప్రశ్నించాలని బీజేపీ నేత అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.