మనతెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పబ్ను ఎక్సైజ్ సిబ్బంది సోమవారం సీజ్ చేశారు. లాక్డౌన్ మినహాయింపుల్లో భాగంగా కేంద్రం పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు మినహాయింపు ఇచ్చింది. కాని సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మాదాపూర్లోని రిజైన్ స్కై బార్ పబ్ దానిని ఉల్లంఘించింది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడడం, సామాజిక దూరం పాటించకపోవడంతో గందరగోళం ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో కన్పించడంతో ఎక్సైజ్ శాఖ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం పబ్కు వచ్చిన సిబ్బంది సిసి కెమెరాలు, పబ్లో పనిచేస్తున్న వారిని విచారించారు. పబ్ యాజమాన్యం కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్దారించి సీజ్ చేశారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Excise Officials Seized Pub in Madhapur for violating Corona