Sunday, September 22, 2024

ఎపిలో కొత్తగా 2,783 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2783 New Corona Cases Registered in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 82,045 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 2,783 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,23,348కు చేరింది. కొత్తగా 14మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,690కి చేరింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక, గడిచిన 24 గంటల్లో 3,708మంది బాధితులు కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి 7 లక్షల 92వేల మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 80 లక్షల 28 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

2783 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News