కమాన్పూర్ : కుటుంబ కలహాలతో భర్త తన భార్యను హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. మృతురాలు తల్లితండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన స్వరూప(42), జూలపల్లికి చెందిన తిరుపతికి 23 ఏళ్ల క్రితం వివాహాం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో పోర్టులో డ్రైవర్గా పనిచేస్తున్న తిరుపతి ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతూ భార్య పిల్లలను సరీగా పట్టించుకోకపోవడంతో భార్యా,భర్తలు గొడువపడుతుండేవారు.
శుక్రవారం ఇంట్లో గొడవ జరుగగా స్వరూపను గొంతు నులిమి చంపి తిరుపతి పరారీ అయ్యాడు. కరీంనగర్కు వెళ్లి వచ్చిన స్వరూప కుమారుడు పవన్, కూతురు శృతీ ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులకు గడిపెట్టి ఉండడంతో తలుపులు తీసి చూసే సరికి మంచంపై స్వరూప మృతి చెంది ఉందని పేర్కొన్నారు. మృతురాలు తమ్ముడు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని టు టౌన్ సీఐ 2 లక్ష్మినారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు కావాలని భార్య స్వరూపను వేధించేవాడని ఇటీవల తిరుపతికి రూ. 50 వేలు ఇవ్వడం జరిగిందని మృతురాలు తమ్ముడు రాజేందర్ తెలిపారు.