- Advertisement -
హైదరాబాద్: జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అధికారిక ప్రకటన చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని పవన్ తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థుల్ని నిలబెడతామని జనసేనాని సూచించారు. అటు ఎపిలో బిజెపి-జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందా… లేకా బిజెపితో కలిసి పోటీ చేస్తుందా… అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిఉంది.
Janasena to Contest in GHMC Elections
- Advertisement -