- Advertisement -
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గోషామహల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శైలేందర్, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. నాంపల్లి బిజెపి కార్యాలయానికి ఓం ప్రకాష్ బిఫార్మ్ తీసుకునేందుకు వెళ్లారు. శైలేందర్ యాదవ్ వర్గీయులు ఓం ప్రకాష్ ను అడ్డుకున్నారు. ఇటీవలే టిడిపి నుంచి బిజెపిలో చేరిన ఓం ప్రకాష్ కి ఎలా టికెట్ ఇస్తారని ఆందోళన చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ముందు నుండి పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్త వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా టికెట్ ఇస్తారని శైలేందర్ వర్గీయులు ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కార్యాలయం నుంచి బయటకు పంపారు.
- Advertisement -