- Advertisement -
న్యూఢిల్లీ:గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,521 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ తో మరో 412మంది బాధితులు మరణించినట్లు తెలిపింది. దీంతో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇక, కరోనాతో మరణించివారి సంఖ్య 1,41,772కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 37,725మంది కోలుకోగా… ఇప్పటివరకు కరోనా వైరస్ బారి నుంచి 92,53,306మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,72,293 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
31000 New Covid Cases Registered in India
- Advertisement -